Friday, November 20, 2015
అష్టాదశ పీఠముల ప్రార్థన (Ashtadasa pitamulu)
అష్టాదశ పీఠముల ప్రార్థన
(ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు సూర్యష్టమయం లో పఠిస్తే శ్రత్రువుల మీద విజయం, సర్వ రోగాలు దురమౌతయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. )
ఓం లంకాయాం శాంకరీదేవి ;
కామాక్షీ కాంచికాపురీ ;
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ;
చాముండే క్రౌంచపట్టణే ;
అల్లంపురి జోగులాంబ ;
శ్రీశైలే భ్రమరాంబికా ;
కొల్హాపురీ మహలక్ష్మీ ;
మహుర్యే ఏకవీరికా ;
ఉజ్జయిన్యాం మహాకాళీ ;
పీఠికాయాం పురుహూతికా ;
ఓఢ్యాయం గిరిజాదేవి ;
మాణిక్యా దక్ష వాటికా ;
హరిక్షేత్రే కామరూపీ ;
ప్రయాగే మాధవేశ్వరీ ;
జ్వాలాయాం వైష్ణవీదేవీ ;
గయామాంగళ్య గౌరికా ;
వారణశ్యాం విశాలాక్షీ ;
కాశ్మీరేతు సరస్వతీ ;
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం
సర్వ రోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం !
గోమాహత్మ్యము ( Gomahatyamu)
గోమాహత్మ్యము
అలనాడు
- దేవేంద్రుని భార్య శచీదేవి
- బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
- శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
- శ్రీరాములవారి భార్య సీతాదేవి
- గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
- ఈశ్వరుని భార్య పార్వతీదేవి
- వశిష్టులవారి భార్య అరుంధతీదేవి
వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.
ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.
మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే
సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.
అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే
యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.
ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?
కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము.
ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ (Devistuti)
ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ
- యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
తా : సర్వభూతములయందు విష్ణుమాయ అనుపేరు నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతములందును చేతనా(తెలివి) స్వరూపమై, బుద్ధి స్వరూపమై, నిద్రా స్వరూపమై, క్షుధా(ఆకలి) స్వరూపమై, ఛాయా(ప్రతిబింబ) స్వరూపమై, శక్తి స్వరూపమై, తృష్ణా(దప్పి) స్వరూపమై, క్షాన్తి(ఓర్పు) స్వరూపమై, జాతి స్వరూపమై, లజ్జా(వినమ్రత) స్వరూపమై, శాన్తి స్వరూపమై, శ్రద్ధా(ఆసక్తి) స్వరూపమై, కాన్తి(అందము) స్వరూపమై, లక్ష్మీ(భాగ్యము) స్వరూపమై, వృత్తి స్వరూపమై, స్మృతి(జ్ఞప్తి) స్వరూపమై, దయాస్వరూపమై, తుష్టి(తృప్తి) స్వరూపమై, మాతృ స్వరూపమై, భ్రాన్తి స్వరూపమై ఉండుదేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు.
శ్రీమార్కండేయ పురాణ దేవీమాహాత్య్మం ( శ్రీదేవీసప్తశతీ ) లో పంచమ అధ్యాయంలో దేవీనిస్తుతించే ఇరువదినొక (21) శ్లోకములు
పైన చెప్పిన 21 శ్లోకములను నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కల్గునని పురాణవచనం.
Sunday, November 15, 2015
గో- ప్రార్థన (Go prardhana)
గో- ప్రార్థన
శ్లోll నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయచ l
జగద్ధితాయ కృష్టాయ గోవిందాయ నమోనమః ll
శ్లోll కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్ధవ l
గవాం ప్రశ్రస్యతే వీర, సర్వపాపహరం శివం ll
శ్లోll ఘృతక్షీర ప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః l
ఘృతనద్యో ఘృతావర్తా స్తామే సంతు సదా గ్రుహే ll
శ్లోll ఘృతమే హ్రుదయేనిత్యం ఘృతమ్నాభ్యాం ప్రతిష్టితం l
ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసిస్థితం ll
శ్లోll గావో మమాగ్రతో నిత్యం గావః ప్రుష్ఠత ఏవ చ l
గావో మే సర్వత శ్చైవగవాం మధ్యేవసామ్యహం ll
శ్లోll ఇత్యాచమ్య జపేత్సాయం ప్రాతశ్చ పురుష స్సదా l
య దహ్నా త్కురుతేపాపం తస్మాత్ పరిముచ్యతే ll
Saturday, November 14, 2015
గోవు లో ఉన్న దేవతలు (govu lo unnadevatalu)
గోవు లో ఉన్న దేవతలు
( గోవు లో ఉన్న సకల దేవత మూర్తులను తెలుసుకుందాం, గోవులని పూజించుకుందాం. )
- గోవుపాదము పితృ దేవతలు
- పిక్కలు పిడుగంటలు
- అడుగులు ఆకాశ గంగలు
- ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు
- కర్రి కర్రేనుగ
- పోదుగు పుండరీకాక్ష
- సన్నుకట్టు సప్తసాగరాలు
- గోమయం శ్రీలక్ష్మీ
- పాలు పంచామృతాలు
- తోక తొంబైకోటి ఋషులు
- బొడ్డు పొన్నపువ్వు
- కడుపు కైలాసం
- కొమ్ములు కోటిగుళ్లు
- మొగము దెష్ట
- వెన్ను యమధర్మరాజు
- ముక్కు సిరి
- కళ్ళు కలువరేకులు
- చెవులు శంఖనాదం
- నాలుక నారాయణ స్వరూపం
- దంతములు దేవతలు
- పళ్ళుపరమేశ్వరి
- నోరు లోకనిధి.
వాసవీ కన్యకాష్టకం (vasavi kanyakashtakam)
వాసవీ కన్యకాష్టకం
(వైశ్యా కుల మాత అయిన వాసవి మాత అష్టాకం ) ప్రతి నిత్యం చదవడం వాల్ల అష్టా ఐశ్వర్యలు మరియు సుమంగళిళకు సౌభగ్యము కలుగును.
శ్లోll నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమోనమః l
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః ll
శ్లోll జయాయై చంద్రరూపాయై చండికాయై నమోనమః l
శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమోనమః ll
శ్లోll నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః l
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః ll
శ్లోll అపర్ణాయై నమస్తేస్తు, కౌస్తుంభ్యైతే నమోనమః l
నమః కమల హస్తాయై, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః l
సుముఖాయై నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll కమలాయై నమస్తేస్తు, విష్ణునేత్ర కులాలయే l
మృడాన్యైతే నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి l
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః ll
శ్లోll త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్ l
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ ll
Friday, November 13, 2015
శ్రీ కార్తికేయ స్తొత్రం (Kartikeya stotram)
ప్రజ్ఞా వివర్ధన శ్రీ కార్తికేయ స్తొత్రం
( ఈ శ్లోకన్ని చిన్న పిల్లలతో చాదివించడం వాల్ల వారి బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తునది, చదువులో బాగారాణిస్తారు. )
( ఈ శ్లోకన్ని చిన్న పిల్లలతో చాదివించడం వాల్ల వారి బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తునది, చదువులో బాగారాణిస్తారు. )
శ్రీ స్కంద ఉవాచ:
శ్లోll యోగిశ్వరో మహసీనః కార్తికేయోగ్ని నందన l
స్కన్దః కుమారః సేనాని స్వామి శంకర సపంద ll
శ్లోll గాంగేయ స్తామ్రచూడచ్చ బ్రహ్మచారి శిఖి ధ్వజః l
తారకారి రుమాపుత్రః క్రొన్చారిధ్య పడాసనః ll
శ్లోll శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిందుః సారస్వతో గుహః l
సనత్కుమారో భగవాన్ భోగ మోక్షఫలప్రదః ll
శ్లోll శరజన్మా గుణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ l
సర్వాగమ ప్రణేతాచ వాంచితార్ధ ప్రదర్శనః ll
శ్లోll అష్టావింశతి నామాని మదీయానీతి యః పఠేత్ l
ప్రత్యుషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాచస్పతిర్భవేత్ ll
శ్లోll మహ మంత్ర మయా నీటి మామ నామానుకీర్తనం l
మహప్రజ్ఞా మవాప్నోతి నాత్రకార్యం విచారణ ll
శ్రీ మత్కార్తికేయ స్తొత్రం సంపూర్ణం ఈ 28 పేర్లు ఎవరుచదువుతారో వారికిచదువు, బుద్ధి పెరుగుతుంది.
Thursday, November 12, 2015
Eka Sloki Sundarakanda
ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం చదవవలిసిన శ్లోకం )
తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;
దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;
భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;
దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః
ఫలితం : దీనిని ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుతరొ వారికి కష్టాలు దూరమౌతయి సంతోషం ప్రాప్తిస్తుంది.
Wednesday, November 11, 2015
అర్ధనారీశ్వరస్తోత్రం (ardhanariswara stotram)
అర్ధనారీశ్వరస్తోత్రం
శ్లో ll చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ l
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll కస్తూరికాకుంకుమచర్చితాయై చితా రజః పుఞ్జవిచర్చితాయ l
కృతస్మరాయై వికృతస్మరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణితనూపురాయ l
హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ l
సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకన్ధరాయ l
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll అమ్భోధరశ్యామలకున్తలాయై తటిత్ర్పభాతామ్రజటాధరాయ l
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ l
జగజ్జనన్యై జగదేకపిత్రే నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహపన్నగభూషణాయ l
శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమఃశివాయ ll
శ్లో ll ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువిదీర్ఘజీవీ l
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః ll
ఫలశ్రుతి : దీనిని భక్తితో చదివినవారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని, భార్యా భర్తలు అన్యోన్యతను కలుగజేయును.
Tuesday, November 10, 2015
గురుపాదుకా స్తొత్రం (Gurupadhuka stotram)
శ్రీ ఆదిశంకరాచార్యవిరచిత శ్రీ గురుపాదుకా స్తొత్రం
శ్లోll అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ l
వైరాగ్య సామ్రాజ్యదపూజనాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll కవిత్వ వారాశినిశాకరభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ l
దూరికృతానమ్రవిపత్తితిభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll నతా యయోఃశ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః l
మూకాశ్ర్చ వాచస్పతితాం హితాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ l
సమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ l
నృపత్వదాభ్యాం నతలోకపంకతేః నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్ l
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll శమాదిషట్కరపదవైభవాభ్యం సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ l
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహసహయాక్షధురంధరాభ్యమ్ l
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
శ్లోll కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ l
భోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll
Monday, November 9, 2015
శ్రీ మంగళ చండికా స్తోత్రం (mangala chamdika stotram)
శ్రీ మంగళ చండికా స్తోత్రం
శ్లోll రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళ చండికే l
హరికే విపదాం హర్ష మంగళ కారికే ll
శ్లోll హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే l
శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ll
శ్లోll మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే l
సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ll
శ్లోll పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే l
పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ll
శ్లోll మంగళా ధిష్టితా దేవీ మంగళానాం చ మంగళే l
సంసార మంగళాధరే మోక్ష మంగళదాయినీ ll
శ్లోll సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా l
ప్రతిమంగళ వరేచ పూజ్య మంగళ సుఖప్రదే ll
ఫలితం : ధన, ధాన్య, వ్యాపార అభివృధ్ధికి, కోర్టువ్యవహరల అనుకూలతకు, సకల సమస్యలపరిష్కారార్ధం .
Sunday, November 8, 2015
శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తొత్రం (Sri venkateswara vajrakavacham)
మార్కండేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్
శ్లోll నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం l
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ll
శ్లోll సహస్రశీర్షాపురుషో వేంకటేశ శ్శిరోవతు l
ఫ్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ll
శ్లోll ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు l
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః ll
శ్లోll సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః l
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ll
శ్లోll య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః l
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ll
శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తొత్రంసంపూర్ణం
Saturday, November 7, 2015
శ్రీ దుర్గాష్టకం (Durgastakam)
శ్రీ దుర్గాష్టకం
శ్లోll ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితం
తత్త్వం యస్యమహత్సూక్షం - మనన్దోవేతిసంశయః
శ్లోll జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్ట్యమనవస్థీతిః
శ్లోll దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివాl
శ్లోll శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా
శ్లోll దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయతాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
శ్లోll పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా - త్తథేశ్వర మహాచితః
శ్లోll వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవాతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణీయతేపరాl
శ్లోll భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని
ప్రభేవేద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః
ఫలశ్రుతి : యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్
Friday, November 6, 2015
శ్రీ మహాలక్ష్మష్టకమ్ (mahalakshmastakam)
శ్రీ మహాలక్ష్మష్టకమ్
శ్లోll ఓం నమస్తేఅస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే l
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll నమస్తే గరుడారుఢే డోలాసురభయంకరీ l
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ l
సర్వదు:ఖహరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తిప్రదాయినీ l
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll అద్యన్తరహీతే దేవీ ఆద్యశక్తిమహేశ్వరీ l
యోగఙ్గే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll స్థూల సూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే l
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll పద్మాసనస్థితే దేవీ పరబ్రహ్మస్వరూపిణీ l
పరమేశి జగన్మాత: మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll శ్వేతామ్బరధరే దేవీ నానాలంకారభూషితే l
జగత్థ్సితే జగన్మాత:మహాలక్ష్మి నమోస్తుతే ll
శ్లోll మహాలక్ష్య్మష్టకస్తోత్రం య: పఠేద్భక్తిమాన్నర: l
సర్వసిద్దిమవాప్నొతి రాజ్యం ప్రాప్నొతి సర్వదా ll
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం l
ద్వికాలం య:పఠేన్నిత్యం ధనధాన్యసమన్విత: ll
త్రికాలం య:పఠేన్నిత్యం మహాశత్రువినాశనం l
మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ll
Thursday, November 5, 2015
ద్రాక్షారామం (Draksharamam)
ద్రాక్షారామం
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
జిల్లా : తూర్పు గోదావరి
మండలం: రామచంద్రపురం
ద్రాక్షారామంలో
గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన
సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి
చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి
మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ
మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు
త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు
కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి
కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము.
త్రిలింగ
క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ
శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా,
వ్యాస కాశీగా
ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి
ఆలయం ఒప్పారుతోంది.
శాతవాహన రాజైన
హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో
పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని
భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ
రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని
గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవి గా ప్రసద్ధి నందిన
వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని
చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు.ఎంతో మంది తెలుగు
కవులు శ్రీ భీమేశ్వరస్వామి ని తమ పద్యాలలో కీర్తించినారు. వాటిలో ఈమధ్య వచ్చిన
"దక్షారామ భీమేశ్వర శతకం" ఒకటి. దీనిని ప్రొఫెసర్ వి.యల్.యస్. భీమశంకరం
రచించాడు.
పేరు వెనుక
చరిత్ర:
పూర్వం దక్ష
ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది
దాక్షారామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం
లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానంపాలైన పరమశివుని సతి
సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను
వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం
నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన
ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.
భీమేశ్వరాలయం:
ద్రాక్షారామంలో శివుడు
భీమేశ్వరుడిగా స్వయంభువు గా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి
క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా
పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి
శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని
అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు
వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి'
అని పిలుస్తూ వుంటారు.
ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.
అష్ట లింగాలు:
ఈ భీమేశ్వరుడికి
ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని
విశ్వసించబడుతుంది.తూర్పున కోలంక ,పడమర వెంటూరు,'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో
దంగేరు. నైరుతిలో కోరుమిల్లి'వాయువ్యంలో
సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ
భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర,
యోగీశ్వర, యమేశ్వర మరియు కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు
దర్శనమిస్తాయి. ఇక తూర్పు ,పశ్చిమ ,ఉత్తర , దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో
అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
స్థలపురాణం:
పూర్వము
తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని
యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర
స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ
బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ
రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో
జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా,
మన్మధ ప్రేరేపణచేత
పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం
వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు
చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు,ద్రాక్షారామం,సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు
కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం
వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క
దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ
చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.
అమరావతి:- ఇక్కడ
ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి '
గా వెలిసెను.
భీమవరం:- ఇక్కడ
చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి '
గా వెలిసెను.
పాలకొల్లు:-
ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి '
గా వెలిసెను.
సామర్లకోట:-ఆత్మలింగాన్ని
చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను
కాబట్టి 'కుమారారామ
భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.
దైనందిన
కార్యక్రమాలు:
ప్రతీరోజు ఉదయం
5:00 మేలుకొలుపు,సుప్రభాతం,
5:30 ప్రాతఃకాలార్చన,తీర్ధపుబిందె,
5:45 బాలభోగం,
6:00 నుండి 12:00 సర్వదర్శనం,అభిషేకాలు,అర్చనలు,
మధ్యాహ్నం
12:00 మధ్యాహ్నకాలార్చన,
12:15 రాజభోగం,
12:15 -3:00విరామం,
3:00 నుండి 8:00 వరకు సర్వదర్శనం,పూజలు,అర్చనలు,
రాత్రి
7:30 నుండి 7:45 వరకు స్వస్తి
ప్రవచనం,
7:45 నుండి 8:00 వరకు
ప్రదోషకాలార్చన,నీరాజన మంత్రపుష్పాలు,ఆస్థానపూజ-పవళింపుసేవ,
రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు కవాటబంధం.
పండుగలు:
- ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ,పవళింపుసేవ.
- ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం.
- ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.
- ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రొజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం.
- ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు.
- ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ( భీష్మ ఏకాదశి )రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం.
- ప్రతీ మహాశివరాత్రి పర్వదినము నందు శివరాత్రి ఉత్సవాలు జరుగును.
- శరన్నవరాత్రులు(దేవీనవరాత్రులు)- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు.
- కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు).
- సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.
వసతి:
ప్రతీ నిత్యం
భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ
శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు.
యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు.
దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహము ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో
కోటిపల్లి రోడ్డులో కలదు. డార్మెట్రీ పెద్దది 1 రోజునకు రూ.200/-లు, డార్మెట్రీ చిన్నది 1 రోజునకు రూ.100/-లు.
ఎలా వెళ్ళాలి:
- కాకినాడ, రాజమండ్రి, విజయవాడ నుండి చాలా బస్సులు ఉన్నాయి. కార్తీక లో APSRTC ఒకే రోజులో వాటిని అన్ని కవర్ అయ్యెల ప్రత్యేక పర్యటన బస్సులు నిర్వహిస్తుంది.
- సమీప రైల్వె స్టేషన్ సామర్లకొట ఉంది. సామర్లకొట వరకు రైలు మార్గం ద్వార వెల్లి అక్కడి నుండి బస్ కి గని అటొ కి గని వెల్లవచ్చు.
- సమీప విమానాశ్రయాలు రాజమండ్రి లేదా విజయవాడ వద్ద ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)