Wednesday, October 28, 2015

మంత్రాలయము (Mantralayam)

మంత్రాలయము
రాష్ట్రం       :  ఆంధ్ర ప్రదేశ్
జిల్లా        :   కర్నూలు
మండలం :   మంత్రాలయము



                                   మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
                                                                           
                               అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి:


                                 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.


వివిధ మార్గాల ద్వారా -
1.ట్రైన్ మార్గం ద్వారా
                                                    మంత్రాలయం రోడ్ అనే రైలు స్టేషన్, 15 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయ నుండి ఉంది. స్థానికంగా, అది కూడా తుంగభద్ర అంటారు. మద్రాస్ (చెన్నై) - - బాంబే (ముంబై) రైలు మార్గం, అలాగే బెంగుళూర్ - - బాంబే మార్గం ఈ స్టేషన్ లో ఉన్నది. ఈ మార్గం లో అత్యంత ప్రధాన రైళ్ళు నడుస్తువుంటయ్. స్టేషన్ నుండి భక్తులు చాలా తరచు బస్సు ద్వారా మంత్రాలయం చేరాతరు. అదనంగా, భక్తుల సౌలభ్యం కోసం అందుబాటులో ఇతర ప్రైవేటు వాహనాలు పుష్కలంగా ఉన్నాయి. సన్నిహిత రైలు జంక్షన్ గుంతకల్ ఉంది.
2.రోడ్డు మార్గం ద్వారా

                               మంత్రలయం ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా యొక్క యెమ్మింగనూరు తాలూకాలోని చివరి పట్టణం. మీరు తుంగభద్ర నది దాటిక మీరు కర్నాటకలో ఉంట్టరు. ఆంధ్ర, కర్ణాటక లో అత్యంత ప్రధాన పట్టణాలు మరియు నగరాలను కలుపుతు మంత్రాలయం కు బస్సులు ఉన్నాయి.

3.ఆకాశమార్గం ద్వారా -
                                        హైదరాబాద్ విమానాశ్రయం మంత్రాలయ కు దగ్గరగా ఉంది. ఇది మంత్రాలయ నుండి 240 కిలో.మీ ఉంది. అక్కడ నుండి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా మంత్రాలయ చేరవచ్చు. మరో ప్రత్యామ్నాయం పుట్టపర్తి లో విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుండి రైలు లేదా రోడ్డు ద్వారా మంత్రాలయ చేరవచ్చు.




No comments:

Post a Comment