Saturday, October 17, 2015

శ్రీశైలం బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి (Srisailam)



ప్రాంతం- కర్నూలు జిల్లాలోని శ్రీశైలం
దైవం- బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి
ఆలయం నిర్మించిన సం-  1 వ శతాబ్దం

కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారమై శ్రీ శైలముపై భ్రమరాంబికా సమేతుడై కొలువుదీరి ఉన్నాడు మల్లిఖార్జున స్వామి.ఎంతో పరమ పావనమయిన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి.ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిసారు.ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు ప్రసిద్ది.ఈ పుణ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు చేసిన పాపాలన్ని సమసిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ నమ్మిక.




     
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల లోని దట్టమయిన అటవీ ప్రాంతంలో కృష్టా నదీ తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో కలదు.అలాగే శ్రీశైల శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో ఉంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడ నివశించే కొండ జాతి వారు మల్లన్నను తమ అల్లునిగా భ్రమరాంబికా అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు.అలయంలో పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు.ఇక్కడ శివరాత్రి సంధర్భంగా నిర్వహించే రధోత్సవంలో రధాన్ని వీరే లాగుతారు.స్వామివారి ఆలయాన్ని- శతవాహనులు, యుక్ష్వాకులు,పల్లవులు,కాకతీయులు,విజయనగరాధీసులు మొదలయిన రాజవంశాల వారు అభివృద్ది చేస్తూ వచ్చారు.
     
ఈ ఆలయం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది.స్వామి వారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట.ఆలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారట.ఎంతో మంది ఋషి పుంగవులు స్వామి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమొనరించి ముక్తి పొదారట.అధేవిదంగా శ్రీ శంకారాచార్యులు వారు స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబికాష్టకాన్ని,శివునిపై శివానందలహరిని రంచించారు.

స్థల పురాణం-

     ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివిని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరము కావాలనో కోరుకోమని అడిగెను.అపుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.అంత బోలా శంకరుడయిన పరమశివుడు శిలాదుడుకి వరం ప్రాసదించి అంతర్ధానమయ్యెను.తదనంతర కాలంలో శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యు ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడిగెను.అంత పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా.. నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా వరం ప్రసాదించు అని అడిగెను.అడిగిందే తడవుగా వరాలు ప్రసాదించే బొలా శంకరుడు వరం ప్రసాదించి అక్కడే ఉండి పోయను.దానితో కైలాసం ఉన్న పార్వతి,ప్రమద గణాలు కూడా స్వామి వారి బాటనే పట్టి ఇక్కడే కొలువుదీరారు.ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.
     
ఇంకా స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది.పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు.ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది.ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ.. నేను మీ శిరముపై ఉంచిన మల్లిపూల దండ ఎన్నటికీ వాడి పోకుండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు.శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు

ఎలా వెళ్ళాలి?

                    ఇది సుమారు దక్షిణ హైదరాబాద్ కు 212 km, కర్నూలు నుండి 179 km .




Friday, October 16, 2015

విజయవాడ కనకదుర్గమ్మ (vijayawada)

జయవాడ కనకదుర్గమ్మవిజయవాడ కనకదుర్గమ్మ

ప్రాంతం- కృష్టా జిల్లాలోని విజయవాడ
దైవం- కనకదుర్గమ్మ తల్లి
మాట్లాడే భాషలు-  తెలుగు,ఇంగ్లిష్

క్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి.ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.ఒకసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాము.

స్థల పురాణం -
     
పూర్వం కీలుడనె యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకొమ్మని అడగగా అమ్మా నువ్వు ఎపుడూ నా హృదయ స్ధానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు.అదివిన్న అమ్మ చిరునవ్వుతో సరే కీల నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానది తిరంలో పర్వతరూపుడవై ఉండు నేను కృతాయుగంలో అసుర సమ్హరం తరువాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది.కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు.తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషున్ని వదించి కీలుడి కిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది.తదనంతరం ప్రతిరోజు ఇంద్రాదిదేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది.అమ్మవారు కనకవర్ణశోభితరాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది.
    
ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివున్ని గురించి శతాశ్వమేదయాగం చేశాడు.దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిసాడు.అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.
     మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా తనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు.స్వామి ఇక్కడ మల్లయుద్దం చేసాడు కావున మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.
     ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగన మల్లికార్జునున్ని పునఃప్రతిష్టించారు.మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్ట చేసి శాంతింపచేసారు.అప్పటి నుండి అమ్మ పరమశాంత స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తుంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై వున్నారు.కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైనవి శరన్నవరాత్రులు.ఈ రోజుల్లో గనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.ఈ దసరా తోమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు.
అమ్మవారి అలంకారాలు -
మొదటి రోజు - శ్రీ బాలత్రిపుర సుందరి దేవి


రెండవ రోజు - శ్రీ అన్నపూర్ణాదేవి


మూడవ రోజు - శ్రీ గాయత్రీదేవి


నాల్గవ రోజు - శ్రీ లలిత త్రిపుర సుందరాదేవి


ఐదవ రోజు - శ్రీ మహలక్ష్మి దేవి


ఆరవ రోజు - శ్రీసరస్వతీ దేవి


ఏడవ రోజు - శ్రీ దుర్గాదేవి



ఎనిమిదవ రోజు - శ్రీ మహిషాసుర వర్దిని దేవి


తోమ్మిదోవ రోజు - శ్రీ రాజరాజేశ్వరి దేవి





సువర్ణ కవచం

విజయవాడలో ఇంకా చుట్టుపక్కల అమ్మవారి ఆలయమేకాక చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
1.
భవానీ ద్వీపం
2.
ఉండవల్లి కేవ్స్
3.
ప్రకాశం బ్యారేజ్
4.
రాజివ్ గాంధీ పార్క్
5.
విక్టోరియా మ్యూజియం
6.
మొగల్ రాజపురం కేవ్స్
7.
కోండపల్లి ఫోర్ట్
8.
లెనిన్ స్ట్యాట్యూ

ఎలా వెళ్ళాలి?
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకు దూరం కి"మీ లలో
హైదరాబాద్ నుండి 267
వైజాగ్ నుండి 382
తిరుపతి నుండి 409
వరంగల్ నుండి 237
గుంటూరు నుండి 32
విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు.హైదరబద్ నుంచి ఇంచుమించు ప్రతీ అరగంటకు బస్సు సర్వీసు ఉంది.
ట్రైన్ ద్వారా అయితే రాష్ట్రంలో నడిచే ఇంచుమించు అన్ని ట్రైన్స్ విజయవాడ నుండే వెలతాయి.ఎందుకంటె విజయవాడ స్టేషన్ రైల్వ్ జంక్షన్.
విమానం ద్వారా అయితే దగ్గరలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగాలి.
ఇంకెందుకు ఆలస్యం లోకపావని అయిన అమ్మవారిని దర్శించి తరిద్దామామరి.......


Thursday, October 15, 2015

కాణిపాకం వరసిద్దివినాయక స్వామి (Kanipakam)

కాణిపాకం వరసిద్దివినాయక స్వామి

ప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకం
దైవం- వరసిద్దివినాయక స్వామి
ఆలయం నిర్మించిన సం-  11వ శతాబ్దం
మాట్లాడే భాషలు-  తెలుగు,తమిళం,ఇంగ్లిష్
      తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది, బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు.ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది.అదే నీటిని భక్తులకు తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.మరో విశేషమేమిటంటే ఎపూడూ నీళ్ళతో ఉండే ఈ బావిచుట్టూపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది.ఈ ఆలయం యొక్క పూర్వాపరాలను తెలిపే స్ధలపురాణమ్ను ఒక్కసారి పరిశిలిస్తే...


స్ధలపురాణం -     
                                 పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ,చెవిటి,గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట.అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట.అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట.తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట.ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.


కాణిపాకం చుట్టూ ఉన్న ఆలయాలు -


వరదరాజస్వామి ఆలయం

మణికంటెశ్వరస్వామివారి ఆలయం
ఆంజనేయస్వామి ఆలయం


దగ్గరలో ఉన్న ఆలయాలు -



అత్దగిరి ఆంజనేయస్వామి(22కిమీ) -తవనంపల్లి

సిరిపురం (55కిమీ) -నారాయణిపట్నం
బోయకోండ గంగమ్మ ఆలయం - బొయకొండ

వెంకటెశ్వరస్వామి(65కిమీ) - తిరుపతి


ఇక్కడ నిర్వహించు పండుగలు ఉత్సవాలు -

కాణిపాకంలో వినాయకచవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.20 రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలను చూడటానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు.

ఉత్సవాలు - వాహనాలు -
గ్రామొత్సవం హంసవాహనం
రధోత్సవం నెమలివాహనం
తిరు కళ్యాణం మూషికవాహనం
శేషవాహనం
వృషభవాహనం
గజవాహనం

ఎంతదూరం-ఎలా వెళ్ళాలి ?

తిరుపతి -65 కిమి
చిత్తూరు -12 కిమి
చెన్నై -165 కిమి
హైదరాబాద్ -562కిమి
విజయవాడ - 386 కిమి

ఎలావెళ్ళాలి ?
రాష్ట్రంలోని అన్నిప్రాంతాలనుండి కాణిపాకకు రవాణా సౌకర్యం కలదు.ఈక్షేత్రానికి అనేక మార్గాల ద్వారా చేరుకొవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా -
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుండి కాణిపాకకు రోడ్డు మార్గం కలదు.వివిధ ప్రాంతాల నుండి ఏ.పి.యస్.ఆర్.టీ.సి బస్సులు నడుపుతుంది.ఇంకా తిరుపతి నుండి క్యాబ్లు,జిప్లలో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలుమార్గం ద్వారా -
రైలుమార్గ ద్వారా చేరుకొవాలనుకునేవారు తిరుపతి స్టేషన్ లో దిగి ఇక్కడికి చేరుకొవచ్చు.

ప్లైట్ ద్వారా -
ప్లైట్ ద్వారా కాణిపాకం చేరుకోవాలనుకునేవారు దగ్గరలోని ఎయిర్ పోర్ట్ రేణి గుంట నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.